ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ముందుగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కే జి ఎఫ్
సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా
ప్రశాంత్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు
ప్రభాస్ లాంటి స్టార్
హీరో కావడం ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది.
కే జి ఎఫ్
సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న
సినిమా కావడంతో ఈ చిత్రానికి ఇంత సమయం పడుతుంది.
ప్రభాస్ కూడా ఇటీవలే శస్త్రచికిత్సను పూర్తి చేసుకుని వచ్చి ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు తొందర్లోనే ఈ
సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో భారీగా చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. దానికి సంబంధించిన పనులను ఇప్పటినుంచే మొదలుపెడుతుంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ప్రభాస్ నటిస్తున్న మరొక
సినిమా ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతు ఉండడంతో ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని వారు నిర్ణయించారు. ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కా కుండా మరి కొన్ని సినిమాలను కూడా ఆయన సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం లోని ప్రాజెక్టు కే
సినిమా తొందర్లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. సం దీప్
రెడ్డి వంగా దర్శకత్వం లో చేయాల్సిన స్పిరిట్
సినిమా కూడా వచ్చే ఏడాది సెట్స్ కు వెళుతుంది.
మారుతి దర్శకత్వంలోనీ
సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ సినిమాలను ప్ర భాస్ వచ్చే రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.