టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. మొదటిసారిగా మహేష్ బాబు తో కలసి భరత్ అనే నేను సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాలో నటించిన అంతగా కలిసి రాలేదు. దీంతో తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టింది తాజాగా మరొకసారి రామ్ చరణ్ తో కలిసి నటించేందుకు తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.


అయితే కొద్ది రోజుల నుండి బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే స్టార్ హీరో సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై అటు సిద్ధార్థ కాని కియారా అద్వానీ కాని స్పందించలేదు తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించిన కియారా. తనకు ప్రస్తుతం ఇలాంటి వార్తలను ఎక్కువగా పట్టించుకునే తీరిక లేదని తెలియజేసింది. ఇలాంటి వార్తలు సృష్టించే వారు ఏం ఆశిస్తున్నారో తెలియదని తెలిపింది.


తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే ఎక్కువగా చర్చిస్తానని ప్రస్తుతం తన కెరియర్ మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నట్లుగా తెలియజేసింది. అలాగే నటిగా నేనేంటో నిరూపించే ప్రయత్నంలో ఉన్నాను అని తెలియజేసింది. ప్రస్తుతం తెలుగు హిందీ నీ భాషలో వరస సినిమాలు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లుగా టాక్ వినిపిస్తోంది. హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మడోనా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో ఈమె ను సంప్రదించినట్లు సమాచారం దీనిపై త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: