టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన సంపత్ నంది గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంపత్ నంది దర్శకుడిగా తన కెరియర్ ను ఏమైంది ఈ వేళ సినిమాతో మొదలు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తరువాత ఈ దర్శకుడికి మెగా పవర్ స్టార్ లాంటి స్టార్ హీరో మూవీ ని దర్శకత్వం వహించే అవకాశం లభించింది .

అందులో భాగంగా సంపత్ నంది, రామ్ చరణ్ హీరోగా రచ్చ అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు . ఈ సినిమా మంచి విజయం సాధించింది. దానితో సంపత్ నంది ఒక్క సారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు . అలా అలా రచ్చ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ దర్శకుడిగా మారిపోయిన సంపత్ నంది ఆ తర్వాత బెంగాల్ టైగర్ , గౌతమ్ నంద , సిటిమార్ సినిమాలకు దర్శకత్వం వహించాడు . ఇది ఇలా ఉంటే సంపత్ నంది ఆఖరుగా సీటిమార్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఇప్పటి వరకు సంపత్ నంది తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం... సంపత్ నంది తన తదుపరి సినిమాను సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించబోయే సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు  తెలుస్తుంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: