టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా పరశురామ్ 'యువత' సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆంజనేయులు , సోలో,  శ్రీరస్తు శుభమస్తు , గీత గోవిందం సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ , అక్కినేని నాగచైతన్య తో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు.

అందులో భాగంగా నాగ చైతన్య కు పరశురామ్ ఒక కథను కూడా వినిపించగా ఆ కథను విన్న నాగచైతన్య, పరశురామ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే గీత గోవిందం సినిమా విడుదల అవ్వడం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు పరశురామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలా గీత గోవింద మూవీ తో పరశురామ్ క్రేజ్ పెరిగిపోవడంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కించే అవకాశం వచ్చింది. దానితో పరశురామ్, మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట మూవీ ని తెరకెక్కించాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సర్కారు వారి పాట సినిమా పనులు అన్నీ ముగియడంతో ముందు అనుకున్న కమిట్మెంట్ ప్రకారం నాగ చైతన్య తో ఓ సినిమా చేయాలని పరశురామ్ అనుకున్నాడు. నాగ చైతన్య కూడా పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాక పోతే ప్రస్తుతం నాగ చైతన్య 'థాంక్యూ' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో  నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు హిందీలో లాల్ సింగ్ చద్ద అనే మూవీ లో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక మూవీ లో కూడా నాగ చైతన్య నటించబోతున్నాడు. ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల నాగ చైతన్య ప్రస్తుతానికి పరశురామ్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: