రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలలో నటించాడు. అందులో భాగంగా ప్రభాస్ 'బాహుబలి' సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సహో సినిమాలో హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.  సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కాస్త అలరించినప్పటికీ ఇతర భాషల ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

సహో  సినిమా తర్వాత ప్రభాస్ , రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలో హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా ప్రభాస్ 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా తర్వాత నటించిన సహో , రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర పరాజయాలను ఎదుర్కొన్న సుజిత్,  రాధాకృష్ణ ఇద్దరు దర్శకులు కూడా ఇప్పటివరకు తమ  తదుపరి సినిమాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను ఇప్పటివరకు విడుదల చేయలేదు. అప్పట్లో సుజిత్,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసిఫర్  రీమేక్ తెలుగులో దర్శకత్వం చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.

అవి రూమర్ లు గానే మిగిలిపోయయి. అలాగే పవన్ కళ్యాణ్ తో తేరీ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే రాధాకృష్ణ , గోపిచంద్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుల నుండి ఇప్పటివరకు తమ తదుపరి సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: