అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా పుష్ప.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా లో కనిపించాడు.. బన్నికి జోడీగా రష్మిక మందన్న నటించింది..సినిమా వచ్చి చాలా కాలం అయిన కూడా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.ఇందులో పాటలు, డ్తెలాగులు ఇప్పటికీ జనాలకు వినిపిస్తున్నాయి.. కాగా, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..సినిమా షూటింగ్ మొదలు కాక ముందే సినిమా కథ పై అనేక కథనాలు వస్తున్నాయి.
భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను ఫహద్ ఫాజిల్ పోషించారు. లెక్కల మాస్టారు సుకుమార్  తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా శ్రీవల్లీ పాత్రలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.



హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను ఈ మూవీని విడుదల చేశారు.రెండో భాగం 'పుష్ప: ది రూల్' ను భారీ ఎత్తున రూపొందించాలని మేకర్స్ ప్రణాళికలు రచించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.


పార్ట్ 2 రష్మిక పాత్రను చంపేస్తారని నెట్టింట పుకార్లు షికార్లు కొడుతున్నాయి. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రల్లో ఒక దానిని చంపేస్తారని కొందరు పేర్కొంటున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ హీరోయిన్ శ్రీవల్లీని చెంపేస్తారని, అనంతరం పుష్పరాజ్, భన్వర్ సింగ్‌పై ప్రతీకారం తీర్చకుంటారని మరికొందరు పేర్కొంటున్నారు. హీరోయిన్‌ను విలన్ చంపితే, విలన్ మీద హీరో ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్‌ను 'కెజియఫ్ -2' లో ఫాలో అయ్యారు. అందువల్ల 'పుష్ప-2' ను కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ 'కెజియఫ్-2'తో పోల్చుతున్నారు. 'పుష్ప: ది రూల్' షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాలి. కానీ, మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, రెండో భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నారు. అందువల్ల స్క్రిఫ్ట్‌ ను మార్చే పనిలో ఉన్నారు.మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: