తెలుగు సినీ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ జోడి గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇద్దరూ కూడా వివాహం తర్వాత నాలుగు సంవత్సరాలు సంతోషంగా ఉండి, గత ఏడాది విడాకులు తీసుకుని అభిమానులకు నిరాశ ను కలిగించారు. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉండడం గమనార్హం. ఇకపోతే ఇద్దరు కూడా తమ తమ కెరియర్ పై ఫోకస్ పెట్టినప్పటికీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి . ఇక ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య కు సంబంధించిన ఒక విషయం కూడా చేస్తూ ఉండటం గమనార్హం. నాగచైతన్య తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక యంగ్ హీరోయిన్ తో చైతన్య పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె ఎవరో కాదు మేజర్ సినిమా హీరోయిన్ శోభిత ధూళిపాళ.. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య జూబ్లీహిల్స్ లో ఉన్న కొత్త ఇంటిలోకి మారడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త ఇంటికి అప్పుడప్పుడు శోభితా ధూళిపాళ తో కలిసి నాగచైతన్య వచ్చి , అక్కడ కాసేపు సమయాన్ని గడిపి,  తిరిగి వెళ్తున్నారు అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

ముఖ్య కారణం ఏమిటంటే.. ఇటీవల మేజర్ సినిమా షూటింగ్ సమయంలో శోభిత ను కలవడానికి నాగచైతన్య చాలాసార్లు వచ్చారని తెలుస్తోంది. ఇక అలా వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది అని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని, ఒకే కారులో చక్కర్లు కొడుతున్నారని కూడా వార్తలు వినిపిస్తూనే ఉండడం గమనార్హం. నిజంగానే శోభితా ధూళిపాళ తో చైతు డేటింగ్ లో ఉన్నాడా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటాడా అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: