బుల్లితెర స్టైలిష్ స్టార్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతూ బాగా హల్చల్ చేస్తుంది. ఇక బుల్లితెరపై మేల్ యాంకర్ గా టాప్ పొజిషన్ లో ఉన్న ప్రదీప్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తనకు అసలు ఎవరి నుంచి కూడా పోటీ అనేదే లేకుండా చేసుకున్నాడు.ఇక బుల్లి తెరపై ఆయన చేసే యాంకరింగ్ కి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కేవలం యాంకర్ గానే కాదు ప్రదీప్ చాలా సినిమాల్లో కూడా నటించాడు. హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో ప్రదీప్ నటించాడు. అలాగే ముప్పై రోజుల్లో ప్రేమించటం ఎలా? అనే సినిమాతో గత ఏడాది హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఇకపోతే బుల్లితెర షో లకు ఇంత క్రేజ్ ఏర్పడడానికి కారణం ప్రదీప్ ఒక కారణం అయితే ఇంకొక కారణం మల్లెమల అని చెప్పాలి.ఇక ఈ సంస్థ నుంచి వచ్చిన షో ల ద్వారానే ఎంతో మంది పెద్ద బుల్లి తెర స్టార్ లు అయ్యారు.


జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది నటీనటులు వెలుగులోకి వచ్చి మంచి స్టార్స్ అయ్యారు. అయితే కారణం ఏంటో అసలు తెలియదు కానీ చాలామంది కూడా ఇప్పుడు ఈ సంస్థ లో వచ్చే షో లు అసలు చేయడం లేదు. మొదట జబర్దస్త్ షో నుండి మెగా బిగ్ బ్రదర్ నాగబాబు బయటకు వచ్చేయగా.. ఇక కొన్నాళ్ళ తర్వాత ఈటివికి బ్యాక్ బోన్ గా వున్న హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, వంటి వారు సైతం కూడా సైడ్ అయిపోయారు. సేమ్ ఇదే తరహాలో ఢీ షో నుండి కూడా హైపర్ ఆది, పిల్లి దీపిక , రేష్మి, సుదీర్ ఇంకా అలాగే పూర్ణ లు బయటకు వచ్చేశారు.ఇక దాంతో ఈ షో కి కాస్త క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. అయితే యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ షో భారాన్ని ఎక్కువగా తన భుజాలపై వేసుకుని ఇప్పటి వరకు మోసి నిలబెట్టగా ఇప్పుడు ఆయన కూడా షో నుంచి బయటకు వచ్చేశారని చెప్తున్నారు. మరి ప్రదీప్ ప్లేస్ ను రీప్లేస్ చేసే యాంకర్ ఎవరో  ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: