ఎమ్మెస్ రాజు టాలీవుడ్ లో ఒకప్పుడు బడా ప్రొడ్యూసర్ గా పేరు పొందారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన నిర్మించిన సినిమాలు మంచి విజయాలని అందుకున్నాయి. ఒక్కడు, వర్షం, శత్రువు ఇలా ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. నిర్మాణాల విషయంలో ఏ మాత్రం రాజీపడని నిర్మాతగా పేరు పొందారు ఎమ్మెస్ రాజు. ఈయనతో సినిమా చేయడానికి ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపించేవారు. కానీ ఆ తరువాత ఈయన కు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి.



ప్రస్తుతం తన బ్యానర్ లోనే సొంత నిర్మాణ పనులను పక్కనపెట్టి డైరెక్టర్గా ముందుకు వెళుతున్నారు. తను రూపొందిస్తున్న తాజా చిత్రం 7 డేస్ 6 నైట్స్ ఈ సినిమా ఈనెల 24న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు చిత్రబృందం తాజా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ. నిర్మాత గా ఉన్నప్పుడు ఒక స్థాయిని చూశాను కానీ అక్కడి నుంచి ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోవడం మొదలైంది అని తెలిపారు. దీంతో ఇండస్ట్రీ లో తన పని అయిపోయిందని అందరూ అనుకున్నారని తెలియజేశారు.


దేవి సినిమా కోసం తన ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మరి సినిమా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఎవరైనా ఇండస్ట్రీలో పడిపోయారు అంటే చాలు అందరూ వచ్చి సపోర్ట్ చేసే వారని తెలియజేశారు. తనను కూడా ఆదుకున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం పెద్ద హీరోలతో సినిమాల్లో చేయొచ్చు కదా అని అందరూ అడుగుతున్నారు కానీ.. అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పును నేను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసి వుంటుందని తెలిపారు. దర్శకుడిగా ఒక మాదిరి బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ వెళ్లడం వల్ల తనకి కంఫర్ట్ గా ఉంటుంది అందుచేతనే ఇక నిర్మాణం వైపు వెళ్లకుండా డైరెక్టుగానే మీ ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: