ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్  ఎలా మరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ కి పాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చింది. అంతేకాక దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆయన కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.ఇక ఈ క్రేజ్‌, ఉత్సాహంతో భారీ సినిమాలు చేస్తున్నారు చరణ్.ఇదిలావుంటే  ప్రస్తుతం ఆయన పాన్‌ ఇండియా డైరెక్టర్‌ శంకర్‌ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `RC15` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఇకపోతే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని శంకర్‌ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక  ఇందులో చెర్రీకి జోడీగా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. కాగా శ్రీకాంత్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే  ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పోతే ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌గా కనిపిస్తారని టాక్‌. ఇక ఇప్పటికే పలు పిక్స్ లీక్‌ అయి వైరల్‌ అయ్యాయి.అసలు విషయం ఏమిటంటే తాజాగా మరో క్రేజీ బజ్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో చరణ్‌కి తల్లిగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి నటించబోతుందట.

ఎవరంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నీతూ కపూర్‌  చరణ్‌కి మదర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే తల్లి పాత్ర కోసం నీతూ కపూర్‌ని శంకర్‌ అప్రోచ్‌ అయ్యారని, ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇకపోతే మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.కాగా రామ్‌చరణ్‌ మరోసారి బాలీవుడ్‌లో నటించబోతున్నారట. పోతే సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో ఆయన గెస్ట్ రోల్‌ చేయనున్నట్టు సమాచారం.అంతేకాక  చరణ్‌ నెక్ట్స్ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నారు. ఇకపోతే అలాగే `విక్రమ్‌` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉందని సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: