బుల్లితెర నటి అందాల భామ  యాంకర్ రష్మీ గౌతమ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమె బుల్లితెరపై ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది.ఇకపోతే అంతకు ముందు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది.కాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక అదే విధంగా లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటుంది.

 ఇదిలావుంటే మరోవైపు జంతు ప్రేమికురాలు అయిన రష్మీ.. కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా కూడా రష్మీ ఆవేదనను వ్యక్తం చేస్తుంది.అయితే పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అంటూ జంతువులను బలి ఇవ్వడం, మాంసాహారం తినడం వంటి వాటిని వ్యతిరేకిస్తుంటుంది. అంతేకాక  పాలు, పాల పదార్థాలు తినడం కూడా యాంకర్ రష్మీకి ఇష్టముండదు. ఇక ఆ పాల కోసం జంతువులను ఎంతలా హింసిస్తారో తెలుసా? అంటూ అందరినీ నిలదీస్తుంటుంది.ఇదిలావుంటే తాజాగా మరోసారి ఓ పోస్ట్ చేసింది.

అయితే అందులో ఆవును, గేదెను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూపించింది.ఇక  ఇండియాలో ఉన్న దరిద్రం ఇదే.. మనం ఒక వైపు గోమాత అని పిలుస్తుంటాం.. కానీ ఇంకో వైపు వాటి చర్మాలతో తయారు చేసిన లెదర్ వస్తువులను వాడుతుంటాం.. జీవులను హింస పెట్టకుండా తయారయ్యే వస్తువులను మాత్రమే వాడండి అంటూ రష్మీ తన ఆవేదనను వ్యక్తం చేసింది.అంతేకాకుండా మీరు రోజూ తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కాస్త తెలుసుకోండంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.అయితే  మొత్తానికి రష్మీ మాత్రం తన సామాజిక స్పృహను ఇలా పదే పదే చాటుకుంటూ ఉంటుంది. ఇకపోతే  కొందరు రష్మీకి తమ వంతు మద్దతు ప్రకటిస్తున్నా, మరి కొందరు మాత్రం నువ్వు చెప్పేవి వినడానికి బాగుంటాయి కాని అమలు చేయడానికి బాగుండవు అని పేర్కొన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: