మహానటి కీర్తి సురేష్ గురించి అందరికి తెలిసిందే. ఈమె అందం, అభినయం, తన నటన తో అందరిని మెప్పిస్తూ ఉంటుంది.ఇదిలావుంటే తాజాగా కీర్తి సురేష్...మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కి జోడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలావుండగా మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. అయితే ఏ ముహూర్తాన ఆ సినిమా చేసిందో కానీ అమ్మడికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మంచి విజయం కూడా దక్కలేదు.ఇకపోతే వరుస ప్లాపులు.. ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో కొద్దిగా విజయాన్ని అందుకున్నా.. 

అది మహేష్ లెక్కలోకి వెళ్లిపోవడంతో మళ్లీ యధాస్థితికి వచ్చేసింది. ఇదిలావుంటే మహానటి తరువాత కమర్షియల్ ఫిల్మ్స్ ను వదిలేసి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంది. ఇక అదే ఆమె చేసిన తప్పు అని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇకపోతే కథలు ఎంచుకోవడం కీర్తి శ్రద్ద చూపించడం లేదని, లేడీ ఓరియెంటెడ్ అనగానే ఓకే చెప్పేయడంతో అవి ప్రేక్షకులను అలరించడం లేదని ప్రస్తుతం  సమాచారం నడుస్తోంది.ఇదిలావుంటే ....ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిమానులు, సన్నహితులు చెప్పినా వినకుండా మళ్లీ లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే రెడీ అవుతుందట మహానటి కీర్తి సురేష్.ఇకపోతే కమర్షియల్ చిత్రాలతో పాటు కథ నచ్చితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా రెడీ అని చెప్తుందంట.

అయితే ఇప్పటికే అమ్మడి చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి.ఇక  ఇవి కాకుండా మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టింది. అయితే ఇవి పూర్తయ్యే లోపులో లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తే టక్కున ఓకే చెప్తానని స్టేట్మెంట్ కూడా ఇస్తుందట.ఇదిలావుంటే ఒక్కసారి దెబ్బ తిని ఉన్నాక కూడా మళ్లీ ఈ ప్రయోగాలు అవసరమా చిన్ని.. అంటూ కోలీవుడ్ అభిమానులు అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాక అయినా ఇవేమి తనకు పట్టవని, తాను లేడీ ఓరియెంటెడ్ కు కూడా సై అంటానని కూర్చున్నదట. అయితే ఇక కీర్తి తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు.ఇకపోతే  మంచి హీరోల సరసన మంచి పాత్రలు చేయొచ్చు కదా కీర్తి అంటూ ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నారట. ఇక మరి అభిమానుల మాట విని కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తుందా..? లేక తనకు ఇష్టమైన లేడీ ఓరియెంటెడ్ కథలకే ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: