టాలీవుడ్  స్టార్ హీరో లైన  మెగా స్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి మనకి తెలియంది కాదు.వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ఇద్దరు ప్రస్తుతం వరుస సినిమాలతో  బిజీ బిజీగా ఉన్నారు.ఇదిలావుంటే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికగా మీద కనబడితే అభిమానులు ఎంత సంబురపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇకపోతే  మెగా-నందమూరి అభిమానులు వీరిని చూసి మురిసిపోతారు.ఇదిలావుండగా ఇటీవల కాలంలో బాలయ్య తొలి తెలుగు ఓటీటీ 'ఆహా'AHAలో..'

అన్ స్టాపెబుల్' షోతో అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ షో సీజన్ 1 ముగియగా, సీజన్ 2 త్వరలో స్టార్ట్ కానుంది.అయితే ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి సీజన్ 2ను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.అంతేకాకుండా  ఇప్పటికే ఈ షోలో పలువురిని ఇంటర్వ్యూ చేసి వారిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన బాలయ్య..ఇకపోతే ఈ సారి సీజన్ 2లో రెచ్చిపోనున్నారని చెప్పొచ్చు.కాగా  సీజన్ 2 తొలి అతిథిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఇక ఇందుకు చిరు..ఒప్పుకున్నారని వినికిడి.అయితే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్  రేటింగ్స్ ..

ప్లస్ సర్వేలో 9.7 రేటింగ్ తో బాలయ్య షో బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్నది.కాగా  ఈ అన్ స్టాపెబుల్ షోతో 'ఆహా' ఓటీటీకి సబ్ స్క్రైబర్స్ ఎక్కువ మంది యాడ్ అయ్యారని టాక్. అంతేకాక నందమూరి బాలయ్య, చిరంజీవి ప్రస్తుతం కుర్రహీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు.బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన అనంతరం అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. అటు చిరంజీవి సైతం గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.వీటిలో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాన్ని అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్డ్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: