సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో త్వరలో ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీ పట్టాలెక్కనుంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు టాక్. గతంలో తామిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ సక్సెస్ ని మించేలా తప్పకుండా భారీ విజయం సాధించేలా ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేశారట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .మొదటి నుండి అందరిలో కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ పై మంచి అంచనాలు ఉడడంతో పాటు మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పై మరింతగా ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీలో స్టార్ నాయిక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మది ఫోటోగ్రాఫర్ గా అలానే ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీ జులై లో సెట్స్ మీదకు వెళ్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మహేష్, తన ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో హాలిడే గడుపుతున్న విషయం తెల్సిందే. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ మూవీ మరింత లేట్ గా ప్రారంభం కానున్నట్లు చెప్తున్నారు.

ముఖ్యంగా దానికి కారణం, మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయినప్పటికీ, ఇటీవల దానిని త్రివిక్రమ్ నుండి విన్న మహేష్, అందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు సూచించారని, అవి పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది కనుక, షూట్ కూడా వాయిదా పడ్డట్లు టాక్. వాస్తవానికి ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటూ పూజా కార్యమ్రాల సమయంలో ప్రకటించిన యూనిట్, షూట్ మరింత ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: