టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా సమంత -  నాగ చైతన్య    మంచి గుర్తింపు పొందారు.వీరి జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.గత ఏడాది విడకులు తీసుకున్న వీరు ప్రస్తుతం  వారి పర్సనల్ లైఫ్ లో బిజీ బిజీగా ఉన్నారు.ఇక అసలు విషయం ఏంటంటే...మొన్నటి వరకు నాగ చైతన్యపై పరోక్షంగా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చేసిన సమంత.. ఇప్పుడు ఏకంగా ఎదురుదాడికి దిగింది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎఫైర్ పెట్టుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ వేశారు.అయితే సమంత పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదని, 

అలాగే ఆమె తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.ఇకపోతే  ఈ పుకార్ల వెనుక నాగ చైతన్య పిఆర్ టీం హస్తం ఉందని అప్పట్లో సమంత పిఆర్ టీం ఆరోపించారు. ఇక నాగ చైతన్య కావాలనే సమంతపై వెనకుండి ఈ పుకార్లు వ్యాప్తి చేయిస్తున్నారని సమంత టీం ఆరోపించడం జరిగింది.ఇదిలావుంటే తాజాగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎఫైర్ రూమర్స్ వెనుక సమంత పిఆర్ టీం ఉందని నాగ చైతన్య పిఆర్ టీం ఆరోపిస్తున్నారు. అయితే నాగ చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి సమంత పిఆర్ టీం కావాలనే లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని నాగ చైతన్య టీం ఆరోపిస్తున్నారు. ఇక ఈ పరస్పర దాడుల గురించి వివరిస్తూ ఓ మీడియా సంస్థ కథనం రాసింది.కాగా  సదరు కథనాన్ని కోట్ చేస్తూ సమంత… 

ట్వీట్ చేశారు.అయితే ఓ అమ్మాయి పై రూమర్స్ వస్తే అవి నిజాలు, అదే ఓ అబ్బాయిపై వస్తే మాత్రం కావాలని ఓ అమ్మాయి చేయిస్తున్న దుష్ప్రచారం. అంతేకాక ఇకనైనా ఎదగండిరా బాబూ. ఇక తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు.అంతేకాకుండా  మనం ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లడమే … అంటూ సమంత తన ట్వీట్ లో కామెంట్ చేశారు. అయితే సమంత ఏకంగా నాగ చైతన్య, తన గురించి రాసిన ఆర్టికల్ ట్యాగ్ చేసి ఈ కామెంట్స్ చేయడంతో ప్రత్యక్ష దాడికి దిగినట్లు అయ్యింది.ఇకపోతే నాపై వచ్చిన రూమర్స్ మాత్రం నిజం.. కానీ.  నాగ చైతన్యపై వచ్చిన రూమర్స్ మాత్రం నేను కావాలని చేయిస్తున్నానా..? అంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు.అయితే  సమంత ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాక టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: