ఈ సినిమాను దిల్ రాజ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ఈ రోజు కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు తెలుగులో 'వారసుడు' మరియు తమిళ్ లో 'వారిసు' గా నిర్ణయించారు. ఇందులో విజయ్ సూట్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు అప్పుడే ట్రోల్స్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి మహేష్ తో చేసిన మహర్షి మూవీని లింక్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అందులో కూడా మహేష్ బాబు ఫారిన్ లో సీఈఓ గా పనిచేస్తూ మళ్ళీ ఇండియాకు తన స్నేహితుడి సమస్యను తీరుస్తాడు. అయితే ఇందులో ఫోటోను బట్టి చూస్తే అదే సీఈఓ గా కనిపిస్తున్నటు ఉన్నాడు.
అందుకే నెటిజన్లు మహర్షి సీక్వెల్ ను తీస్తున్నాడా అన్న సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇది నిజంగా విజయ్ ఫ్యాన్స్ కు ఒక ట్రీట్ అని చెప్పాలి. అందరూ ఈ న్యూస్ ను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ కథ ఏమిటో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.