దర్శకుడు
వంశీ పైడిపల్లి మహర్షి
సినిమా తర్వాత ఏ
సినిమా చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేసిన తర్వాత ఆయన ఏ
సినిమా చేస్తాడో అన్న ఆత్రుత కూడా అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళనాట స్టార్ హీరోగా ఉన్న
విజయ్ దళపతి తో
సినిమా చేయడం అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ
సినిమా కోసం
విజయ్ దళపతి ఏకంగా వంద కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు అనే వార్తలు వచ్చాయి.
ఈరోజు
విజయ్ దళపతి పుట్టినరోజు కావడంతో ఈ
సినిమా యొక్క టైటిల్ ను పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. వారిసు అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టారు. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇంకా నిర్ధారించలేదు. ఇదే టైటిల్ తో తెలుగులోనూ తెరకెక్కిస్తారా లేదా మరేదైనా టైటిల్ ను అనుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంపై తెలుగు తమిళ ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
తాజాగా ఈ
సినిమా నుంచి విడుదలైన
పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇందులో
విజయ్ దళపతి స్టైల్ కంటే ఎక్కువగా
వంశీ పైడిపల్లి స్టైల్ కనిపిస్తుందని చెపుతున్నారు కొంతమంది
సినిమా విశ్లేషకులు. క్లాస్ టేకింగ్ తో
మాస్ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు
వంశీ పైడిపల్లి ఈ సినిమాలోనూ అలాంటి స్టైల్ కణపరిచి అందరినీ
ఫిదా చేస్తాడని అంటున్నారు. మరి వీరి కాంబినేషన్లో రాబోతున్న తొలి
సినిమా కావడంతో చిత్రబృందం ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తుది. ఇంకొక వైపు
విజయ్ దళపతి కి గత
సినిమా డిజాస్టర్ ను అందించడంతో ఈ
సినిమా తప్పకుండా హిట్ అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.