ప్రస్తుతం అటు బాలీవుడ్ ప్రేక్షకులకు…ఇటు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు తెలుగు సినిమా పై ఫోకస్ రాను రాను పెరుగుతూనే ఉంది.అయితే ఇక  అక్కడ తెరకెక్కించే పెద్ద సినిమాల్లో మన తెలుగు నటీనటులు కూడా ఉండాలని భావిస్తున్నారు అక్కడి మేకర్స్.ఇదిలావుంటే రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'.అయితే ఈ సినిమా లో నాగార్జున నటించారు. అంతేకాదు అలాగే ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' లో నాగ చైతన్య కూడా నటించడం జరిగింది.ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'కబీ ఈద్ కబీ దివాలీ' చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషించనున్నాడు.

ఇకపోతే  అలాగే  తాజా సమాచారం కొద్ది ఈ చిత్రంలో.. రాంచరణ్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలావుంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జవాన్' చిత్రంలో రానా కూడా నటించబోతున్నాడట. ఇక ఇదివరకు వరుస పెట్టి హిందీ సినిమాల్లో నటిస్తూ వచ్చిన రానా ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ ఇవ్వడం మనం చూసాం.ఇకపోతే 'జవాన్' చిత్రం ద్వారా మళ్ళీ హిందీలో నటించడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా గా  తెలుస్తుంది.అయితే   రానాకి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది అన్న సంగతి మనందరికి తెలిసిందే.

కాగా తమిళంలో, మలయాళంలో కూడా రానా క్రేజ్ సంపాదించుకుకోవడం జరిగింది .ఇకపోతే అందులోనూ.. షారుఖ్ - అట్లీ కాంబో తెరకెక్కుతున్న మూవీ పాన్ ఇండియా మూవీ. కాబట్టి…. రానా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఇక ఇదిలావుంటే చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుఖ్‌ హిట్టు మొహం చూడలేదు.అయితే ఇక  ఆ సినిమా వచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అయితే  ఆ సినిమా మొత్తం సౌత్ ఫ్లేవర్ లో ఉంటుంది. కాబట్టి..  హిట్ అయ్యింది.తాజాగా  ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో చేసే మూవీ కూడా ఇంచు మించు అలానే ఉండబోతుంది అని వినికిడి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: