'బాహుబలి'  సినిమా రిలీజ్ అనంతరం ఉత్పన్న వ్యాపారాల వెల్లువ గురించి  మనందరికి తెలిసిందే.అయితే  బాహుబలి టాయ్స్ తో పాటు బాహుబలి యానిమేటెడ్ బొమ్మలు.. సిరీస్ లు వగైరా బోలెడంత మార్కెట్ ని క్రియేట్ చేసాయి.ఇదిలావుంటే తాజాగా బాహుబలి తరహాలోనే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన #RRR పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా ప్రపంచ దేశాల్లో మన్ననలు అందుకుంటోంది.ఇకపోతే  సరిగ్గా ఇలాంటి సమయంలో రాజమౌళితో కలిసి రామ్ చరణ్ - రామారావు కలిసి rrr బ్రాండ్ తో రెస్టారెంట్ చైన్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారని కథనాలొస్తున్నాయి.

అయితే నిజానికి స్నేహితులైన రామ్ చరణ్ - రామారావు లను ప్రముఖ నిర్మాత ఈ కొత్త ఆలోచనతో సంప్రదించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఆ ఇద్దరితో రాజమౌళి కూడా చేరితే బావుంటుందని ఆయన అన్నారట.ఇది ఎంతవరకూ ముందుకెళుతుంది? అన్నది ఇప్పుడే చెప్పలేం.ఇకపోతే ప్రస్తుతం ఆ ముగ్గురూ కెరీర్ పరంగా ఎంతో బిజీ. పాన్ ఇండియా సినిమాలతో చరణ్- తారక్ బిజీ బిజీ. రాజమౌళి కి క్షణం తీరిక లేదు. అయితే ఒకవేళ rrr బ్రాండ్ తో రెస్టారెంట్ల చైన్ ని ప్రారంభించాలంటే టైటిల్ పై సర్వహక్కులు కలిగి ఉన్న నిర్మాత డివివి దానయ్య కూడా జాయిన్ కావాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఇదంతా కేవలం స్పెక్యులేషన్ స్టేజ్ లోనే ఉంది. ఇక దీనిని గాసిప్ గానే భావించాలి. ఇకపోతే ఒకవేళ rrr పేరుతో రెస్టారెంట్ ల నిర్వహణ వ్యాపారాన్ని ప్రారంభిస్తే దానికోసం సమయాన్ని కేటాయించే సన్నివేశం ఆ ముగ్గురికీ ఉందా? అంటే ఛాన్సే లేదన్నది కూడా తెలిసినదే.పోతే చరణ్ వరుసగా శంకర్ తో సినిమా తర్వాతా పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుండగా... ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ లతో పాన్ ఇండియా మూవీ సన్నాహకాల్లో ఉన్నాడు. ఇక రాజమౌళి మహేష్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: