యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు.అంతగా పాపులర్ అయ్యారు..ఒక్క సినిమా అతని జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం డార్లింగ్ కెరియర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది..అందుకే ఇప్పుడు వరల్డ్ మెచ్చిన స్టార్ హీరో అయ్యాడు.. పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా వున్నాడు. అయితే, బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా అనుకున్న ఫలితాలను అందించలేదు.. దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం కోసం కొత్త కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలను చేస్తున్నారు..


ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన తదుపరి సినిమా లో పైన దృష్టి పెట్టాడు. ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమాలో ఆది పురుష్ కూడా ఒకటి. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా రెమ్యూనరేషన్ విషయం ఎప్పుడూ చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ లో భారీగా మార్పులు వచ్చిన విషయం తెలిసిందే.


సాహో, రాధే శ్యామ్ వంటి వాటి కి భారీ స్థాయి లోనే రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమా కు ప్రభాస్ వంద కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ నటించబోతున్న సినిమా ల్లో ప్రభాస్ రెమ్యూనరేషన్ మరింత పెంచేశాడని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఆదిపురుష్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఇది వరకు ఈ సినిమా కోసం ప్రభాస్ వంద కోట్లు అడిగారనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ తన పారితోషికాన్ని పెంచేశాడని తెలుస్తోంది... మరి సినిమా ఎ మాత్రం హిట్ అవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: