విలక్షణ నటుడు కమల హాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్.. లోకేష్ కనకరాజు రూపొందించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది..భారీ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ను కూడా అందుకుంది.జూన్ 3న విడుదలైన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చాలాకాలం తర్వాత కమల్ హాసన్‌ని సరైన హిట్‌ని ఇచ్చింది. పవర్-ప్యాక్డ్ కథాంశం, యాక్షన్ సన్నివేశాలతో కమల్‌ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన 20 రోజుల్లోనే రూ. 350 కోట్లకి పైగా కలెక్షన్స్‌ని సాధించింది. ముఖ్యంగా తమిళనాడు లో రూ.155 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది.


దాదాపు ఐదేళ్లుగా పదిలంగా ఉన్న బాహుబలి 2 సాధించిన రూ.152 కోట్ల కలెక్షన్లని దాటేసి నెంబర్ 1గా నిలిచింది. త్వరలోనే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది..థియేట్రికల్ రన్ పూర్తి కాని విక్రమ్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదే ఈ సినిమా OTT విడుదల గురించి. ఆ న్యూస్ ఆ కమల్ అభిమానులతోపాటు విక్రమ్ మూవీ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. అయితే.. ఈ సినిమా వచ్చే నెల అంటే జూలై 8న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది.


కమల్ అభిమానులతో పాటు, యావత్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్థిగా ఎదురు చూస్తున్నారు.ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి, ఫహాద్ పాజిల్ ముఖ్యపాత్రలు పోషించగా.. తమిళ హీరో సూర్య 'రోలెక్స్' అనే పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. కాగా.. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు..మొత్తానికి కమల్ నిధి నిండింది..ఈ సినిమా హిట్ అయినందుకు డైరెక్టర్ కు ఖరీదైన కారును గిఫ్ట్ గా, హీరో సూర్యకు రొలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు కమల్.. భారతీయుడు 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: