గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా విడుదలకు ప్రస్తుతం సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గోపీచంద్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తనకున్న స్నేహబంధం మరియు ఆయనతో సినిమా ఆఫర్ వస్తే ఎలా అనే విషయం పై ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. గోపీచంద్ మరియు ప్రభాస్ లు ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి వర్షం సినిమాలో నటించారు. ఆ తర్వాత పలు సందర్భాలలో ఒకరి సినిమాల ఫంక్షన్ లకి మరొకరు కనిపించడం జరిగింది.

ప్రభాస్ తో ఉన్న స్నేహం గురించి గోపీచంద్ కొన్ని సందర్భాలలో చాలా అరుదు గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇద్దరి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది అనే విషయం మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతున్నారు. ఇక అలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తే మీరు ఎలాంటి పాత్రను కోరుకుంటారు అనే ప్రశ్న గోపీచంద్ ను అడగగా.. ప్రభాస్ అడగాలే కానీ పాత్ర ఏదైనా సరే తప్పకుండా చేస్తానని గోపీచంద్ తెలియజేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని అభిమానులు సైతం చాలా వైరల్ గా చేస్తున్నారు.


గతంలో గోపీచంద్ విలన్ గా నటించినా.. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. అయినా కూడా ప్రభాస్ అడిగితే విలన్ పాత్ర చేయడానికి సిద్ధమే అని తెలియజేశారు. దీంతో ప్రభాస్ పై ఉన్న ప్రేమ ఈ మాటల ద్వారా తెలియజేశారు. ఇక గోపీచంద్ నటించిన సినిమా విషయానికి వస్తే పక్కా కమర్షియల్ సినిమాను డైరెక్టర్ మారుతి ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఉంటారని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీ ఖన్నా నటించింది. గోపీచంద్ కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మరొక రెండు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: