సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. వారు గతంలో నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం, అలాగే వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో దర్శకనిర్మాతలు కూడా ఆ ఇద్దరి కాంబినేషన్ లో  సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అలా దర్శక నిర్మాతలు కూడా ఆ జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండడం వల్ల జోడి ని మళ్ళీ రిపీట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది అలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెండి తెరపై మంచి జంటగా పేరు తెచ్చుకున్న జంటలలో ప్రభాస్ , అనుష్క జోడి ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో బిల్ల ,  మిర్చి ,  బాహుబలి సినిమాలు తెరకెక్కాయి. ఇందులో బిల్ల సినిమా ఒకటి ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ఇందులో కూడా ప్రభాస్, అనుష్క జంటకు మంచి ఆదరణ లభించింది. అలాగే ఆ తర్వాత మిర్చి , బాహుబలి సినిమాలు మంచి విజయాలను సాధించడం మాత్రమే కాకుండా,  ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు లభించాయి. ఇలా వీరిద్దరి జంట కు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ వున్న ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన మారుతీ  దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం  మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే అనుష్క ను చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే మరొక సారి ప్రభాస్ సరసన అనుష్క నటించబోతున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: