సినిమా ఇండస్ట్రీలో ఒకసారి కలిసి నటించిన జంటలకు గనక ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించినట్లు అయితే,  దర్శక నిర్మాతలు ఆ హీరో, హీరోయిన్ లపై సినిమాలను నిర్మించడానికి మరింత ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పటికే ఒకసారి నటించిన జంటలు మరొక సారి కూడా వెండితెరపై అలరించబోతున్నాయి. అలా ప్రస్తుతం రెండవసారి రిపీట్ అవుతున్న జంటల గురించి మనం తెలుసుకుందాం .

మెగాస్టార్ చిరంజీవి , మిల్కీ బ్యూటీ తమన్నా వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కింది . ఈ సినిమా మంచి విజయం సాధించింది . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది .


నాగ చైతన్య ,  రాశి ఖన్నా ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో వెంకీ మామ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన థాంక్యూ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది .


రామ్ చరణ్ , కియారా అద్వానీ గతంలో వీరిద్దరూ కలిసి వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది .


నాగ చైతన్య , కృతి శెట్టి వీరిద్దరూ కలిసి ఇది వరకు బంగార్రాజు సినిమాలో కలిసి నటించారు. మరి కొన్ని రోజుల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు .


సూపర్ స్టార్ మహేష్ బాబు , పూజా హెగ్డే ఇది వరకు వీరిద్దరూ కలిసి మహర్షి సినిమాలో నటించారు. మరి కొన్ని రోజుల్లో మహేష్ బాబు,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా మహేష్ బాబు , పూజా హెగ్డే కలిసి నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: