పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు అయిన సాయితేజ్ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి అన్నీ తానై నడిపిస్తున్నారట త్రివిక్రమ్.


ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా త్రివిక్రమే రాశారట.. అయితే హారిక-హాసిని క్రియేషన్స్ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ సినిమాకి తన పేరు వేయించుకోవడం లేదని సమాచారం.దానికి బదులుగా తన సొంత నిర్మాణ సంస్థను ఈ ప్రాజెక్ట్ కి ఎటాచ్ చేశారని తెలుస్తుంది..


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయితేజ్ సరసన హీరోయిన్ గా కనిపించనుందట . ఈ అవకాశం త్రివిక్రమ్ రికమెండేషన్ తో వచ్చినట్లు సమాచారం. 'భీమ్లానాయక్'సినిమాతో త్రివిక్రమ్ కు, సంయుక్త మీనన్ కు అసోసియేషన్ ఏర్పడిందట.ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.


 


తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారట.ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. ఒరిజినల్ వెర్షన్ లో హీరో ఫ్యామిలీ మ్యాన్. కూతురికి పెళ్లి చేసే వయసు ఉంటుందట.. కానీ రీమేక్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ లో పూర్తిగా మార్పులు చేసినట్లు తెలుస్తుంది.


 


సాయితేజ్ ను తీసుకొని, అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసి పెట్టారట.. కథ ప్రకారం.. సినిమాలో హీరోకి యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు. అదే సమయంలో దైవ దూతగా పవన్ కళ్యాణ్.. హీరోకి సెకండ్ ఛాన్స్ ఇస్తారట.ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా.



మరింత సమాచారం తెలుసుకోండి: