గత ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా క్రాక్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయమయ్యారు.


జయమ్మ పాత్రలో అందరినీ సందడి చేసిన ఈమె మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో మంచి క్రేజ్ ను ఏర్పరుచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమెకు తెలుగు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాకు తెరకెక్కుతోన్న యశోద సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారట..


ఇందులో ఈమె పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ చివరిదశ షూటింగ్ కు చేరుకుందట.అయితే ఈ సినిమాలో వరలక్ష్మీ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఈమె యశోద సినిమాకు గుడ్ బై చెప్పారట.. ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు.


 


ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. యశోద టీమ్ కి థాంక్స్.. నా షూటింగ్ పూర్తయింది. మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు ఈ సినిమాని వెండితెరపై చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ను చేశారు. ఇలా ఈ సినిమా యూనిట్ గురించి ఈమె ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు.


 


ఈ క్రమంలోని చిత్రబృందం మొత్తం తనకు మాత్రం ఏకంగా ముద్దులు పెడుతూ యశోద సినిమా సెట్ నుంచి తనకు గుడ్ బై చెప్పారట. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: