మెగా - అల్లు ఫ్యామిలిలో చీలికలు వచ్చాయని.. అల్లు అర్జున్ కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి మధ్య సంబంధాలు కాస్త దూరం అయ్యాయి అని వార్తలు బాగా వినిపించాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ముద్ర ను తొలగించుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో కూడా మెగా vs అల్లు ఫాన్స్ వార్ గురించి ఇప్పటికీ ఏదో ఒకచోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన ఆలిండియా చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ లో కూడా కొందరు సభ్యులు అల్లు అర్జున్ ను ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగినట్లుగా సమాచారం.

దీంతో అల్లు , మెగా అభిమానుల మధ్య ఒక బిగ్ వార్ నడిచిందని చెప్పవచ్చు. ఈ మధ్యనే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి చెందిన గీతా ఆర్ట్స్ ఈవెంట్ కు చిరంజీవి హాజరు కావడంతో కాస్త సర్ధుమణిగింది అని చెప్పవచ్చు. అల్లు అరవింద్ సమర్పణలో.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఇక మెగా ప్రొడ్యూసర్ తో కలిసి ఒకే వేదికను పంచుకుని తమ మధ్య గొడవలు  పరిష్కరించబడ్డాయి అని చెప్పే ప్రయత్నం చేశారు అని స్పష్టమవుతోంది..

నిజం చెప్పాలంటే పక్కా కమర్షియల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త మెగా బ్యాచ్ రీయూనియన్ పార్టీలా కనిపించింది అని కామెంట్ చేస్తున్నారు.. ఎందుకంటే ఇక్కడ పక్కా కమర్షియల్ సినిమాను ప్రమోట్ చేసినట్లు అనిపించలేదు కానీ అల్లు క్యాంపుగా ముద్రపడిన  బన్నీ వాసు, ఎస్ కే ఎన్, మారుతి  వంటి వారు మెగాస్టార్ ని గొప్పగా ప్రశంసించడం జరిగింది. అంతేకాదు మెగా - అల్లు మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పడానికి అల్లు అరవింద్ చిరంజీవిని ఈ ఈవెంట్ కి తీసుకొచ్చారని తెలుస్తోంది. మొత్తానికి అయితే పక్కా కమర్షియల్ ఈవెంట్ తో మెగా -  అల్లు ఫ్యామిలీ ల మధ్య బంధం కూడా బలంగా ఉందని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: