నయనతార ఎట్టకేలకు విగ్నేష్ శివన్ ను పెళ్ళి చేసుకోవడంతో ఆమె పై ఇక గాసిప్పులకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇంకా నయనతార ను కొంతమంది తమ విచిత్రమైన కామెంట్స్ తో ఆమెను వెంటాడుతూనే ఉన్నారు. నయనతార పెళ్ళి చేసుకుని తనకు ఇష్టమైన గుడుల చుట్టూ తిరిగి ఆతరువాత హనీమూన్ కోసం తన భర్తతో థాయిలాండ్ వెళ్ళింది.


అక్కడ ఉండే అందమైన ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ తన భర్తతో కాలం గడుపుతోంది. అయితే నయనతార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. దీనితో ఆమె హనీమూన్ కు సంబంధించిన ఫోటోలను ఆమె కానీ ఆమె భర్త విగ్నేష్ శివన్ కానీ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీనితో నెటిజన్స్ కు అసహనం పెరిగింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కొందరు థాయిలాండ్ లో నయనతార ను గుర్తుపట్టి ఆమె లుక్ కు సంబంధించిన ఫోటోలను కొందరు షేర్ చేసారు.


ఆ ఫోటోలలో నయనతార విగ్నేష్ శివన్ ను ఆనుకుని చాల ఆరాధనగా అతడిని చూస్తోంది. చేతి నిండా గాజులు మెడలో పసుపుతాడు తో పక్కా గృహిణి లా కనిపించిన నయన్ లుక్ పై కొందరు కామెంట్స్ చేసారు. నయన్ పెళ్ళి అయిన తరువాత పూర్తిగా గృహిణి గా మారిపోయిందని దీనితో ఆమె నటించే భవిష్యత్ సినిమాలలో కూడ ఇలానే కనిపిస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


పరిస్థితులు ఇలా ఉంటే హనీమూన్ నుంచి వచ్చినతరువాత తన సినిమాల షూటింగ్ లలో బిజీ అవుతుందని అంటున్నారు. షారూఖ్ ఖాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఇంకా తన సినిమాల కెరియర్ కొనసాగించే ఉద్దేశ్యంలోనే ఉంది. సినిమాకు 4 కోట్ల పారితోషికం తీసుకునే ఈమెకు 300 కోట్ల ఆస్థులు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి నయన్ స్టామినా ఏమిటో అర్థం అవుతుంది. పెళ్ళి అయిన తరువాత క్రేజీ హీరోయిన్స్ కు క్రేజ్ తగ్గిపోతుంది మరి నయనతార పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: