టాలీవుడ్ లో దర్శకుడు కృష్ణ
వంశీ కి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మం ది పెద్ద హీరోలు క్యూ లో ఉండేవారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆయనతో
యువ హీరోలు కూడా సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు.
సక్సెస్ అనేది
సినిమా పరిశ్రమ లో చాలా ముఖ్యం లేదంటే ఎవరూ కూడా దగ్గరికి వెళ్ళరు. ఆ విధంగా కృష్ణవంశీకి
సక్సెస్ అనేది లేకపోవడంతో ఏ
హీరో కూడా ఆయనను నమ్మే పరిస్థితి లేదు.
పెద్ద సినిమాల సంగతి అటుంచితే చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఆయన చేయలేకపోతున్నారు. ఆ విధంగా కృష్ణవం శీ ఎంతో కష్టపడి ఇప్పుడు ఓ
సినిమా చేస్తున్నారు. అదే రంగమార్తాండ. ఓ పెద్ద స్టార్ ఈ
సినిమా లో లేకపోయినా కూడా
కృష్ణవంశీ ఇమేజ్ తోనే ఈ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడిం ది. ఈ నేపథ్యంలో నే ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ
సినిమా విజయం పైన
కృష్ణవంశీ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పాలి.
ఎంతో మంది
యువ దర్శకులను మధ్య పోటీ ఉండటంతో ఈ సీనియర్ దర్శకుడు
సినిమా పరిశ్రమలో మంచి
సినిమా లు చేస్తూ రాణించాలంటే తప్పకుండా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాల్సిందే. పలుమార్లు బడ్జెట్ కారణాల రీత్యా ఈ
సినిమా ఆగిపోయింది అన్న వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఓటీటీ మంచి రేటు వచ్చిన కారణంగా ఈ చిత్రాన్ని మళ్ళీ
నిర్మాత మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు అయితే అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఏ
సినిమా వచ్చేవరకు రావాల్సిందే.
రంగ మార్తాండ సినిమాలో
రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్,
అనసూయ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.