టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ప్రస్తుతం
సంగీత దర్శకుల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఒకరిపై ఒకరు పై చేయి సాధిస్తూ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వారే
తమన్ మరియు దేవి
శ్రీ ప్రసాద్. తమన్ ఇటీవలి పెద్ద సినిమాలకు అందిస్తున్న సంగీతానికి ప్రేక్షకులు అదరూ కూడా
ఫిదా అయిపోతున్నారు. కేవలం నటన మాత్రమే కాకుండా నేపధ్య సంగీతం విషయంలో కూడా తనదైన స్టైల్ కనబరుస్తూ ప్రేక్షకాదరణ ఎక్కువగా పొందుతున్నాడు.
ఇకపోతే తెలుగు
సినిమా పరిశ్రమ సంగీత ప్రపంచాన్ని ఓ మలుపు తిప్పిన
సంగీత దర్శకుడు
దేవిశ్రీప్రసాద్ ఒక అడుగు వెనక్కి ఉన్న కూడా తమ న్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇటీవల ఆయన సంగీతం అందించిన పుష్ప సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. పాటలతో పాటు
సినిమా యొక్క నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చాయి. గత కొన్ని నెలలుగా వెనకబడ్డ
దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో మళ్లీ కం బ్యాక్ చేసి
తమన్ కు మంచి పోటీ ఇచ్చాడు.
ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండగా అంతకుమించి సంగీతాన్ని అందించే విధంగా ముందుకు పోతు న్నాడు. మరి ఇంకా ఆయన ప్రాబల్యం కొన్ని రోజులు కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ
సంగీత దర్శకుడు మారింది సినిమాలకు సంగీతాన్ని సమకూర్చి ప్రేక్షకులను ఈ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. అయితే అంతకంతకు
తమన్ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు.
టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్
సంగీత దర్శకుడుగా ఉన్న
తమన్ ఇప్పుడు విడుదల కాబోయే సినిమాలతో వేరే స్థాయి
సంగీత దర్శకుడు అవడం ఖాయం అని చెప్పవచ్చు. మరి
తమన్ నుంచి ఎలాంటి పాటలు చూస్తామో మరి.