ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నాలుగు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో  తెరకెక్కిన ఆది పురుష్  సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యలో సలార్ సినిమా యొ క్క మిగిలిన భాగం షూటింగ్ ను ప్రభాస్ మొదలు పెట్టబోతు ఉండగా ఆ తరువాత ఒప్పుకున్న సినిమాల షూటింగ్ ల లో ఆయన పాల్గొన బోతున్నాడు.

ఓం రౌత్ దర్శకత్వంలో రాబోయే ఆది పురుష చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవాల్సిన అవసరం అయితే భారీగానే ఉంది. దానికి కారణం ఏమిటంటే ప్రభాస్ హీరోగా నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని పొందాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేసే ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 

అందుకే ప్రభాస్ కూడా ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఆయన దర్శకులకు కూడా సినిమా చాలా బాగా రావాలని మంచి విజయాలు సాధించాలని ఇప్పటికే సూచించాడట. పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ప్రభాస్ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు.  ఈ నేపథ్యంలో నే ఈ చిత్రం ఆయనకు మంచి సక్సెస్ ఇవ్వకపోతే మాత్రం ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత కూడా ప్రభాస్ బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడు. 




 

మరింత సమాచారం తెలుసుకోండి: