కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా మోహన్ బాబు ఇంకా ఆయన తనయులు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరు కానున్నారు. ఇకపోతే తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి మోహన్‌ బాబు, ఆయన తనయులు విష్ణు, మనోజ్‌లు పాదయాత్రగా కోర్టుకు వెళ్లనుండడం హాట్‌ టాపిక్‌గా మారింది.ఇదిలావుంటే మోహన్‌ బాబు, ఆయన తనయులైన సినీ హీరోలు విష్ణు, మనోజ్‌పై 2019 మార్చి 22న కేసు నమోదైంది. ఇకపోతే విద్యార్థుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసు పెట్టారు. 

అయితే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యా నికేతన్‌ విద్యార్థులతో కలిసి మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లు రోడ్డుపై బైఠాయించారు.ఇక ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది.  పోతే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లంఘిస్తూ ధర్నా చేసినందుకు చంద్రగిరి పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు.ఇదిలావుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై శ్రీ విద్యా నికేతన్‌ అధినేతగా నిరసన తెలిపారు మోహన్‌ బాబు.అయితే  ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని నిలదీశారు.ఇక  శ్రీవిద్యా నికేతన్ విద్యా సంస్థల ముందు విద్యార్థులు, సిబ్బందితో కలిసి మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌ బైఠాయించారు. అయితే దీంతో తిరుపతి-మదనపల్లి హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

అంతేకాక దీనిపై అప్పటి ఎంపీడీవో, ఎంసీసీ టీమ్ అధికారి హేమలత చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపోతే ఎన్నికల అధికారుల నుంచి కానీ పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి కానీ ముందస్తు అనుమతి లేకుండా ధర్నా చేశారని పేర్కొన్నారు.కాగా  మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌తో పాటు శ్రీ విద్యా నికేతన్‌ విద్యా సంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వో సతీష్‌లపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే ఐపీసీ 290, 341, 171 (ఎఫ్‌) రెడ్‌ విత్‌ 34 సెక్షన్లతో పాటు పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 34 కింద కేసులు పెట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించే కోర్టుకు హాజరు కానున్నారు మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లు. ఇకపోతే తిరుపతిలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి కోర్టు వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: