ఈ మధ్యకాలంలో  టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోవడం సర్వసాధారణం అయింది.అయితే వీరు  చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా కూడా వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట విడాకులు తీసుకోగా ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.అంతేకాకుండా అదే విధంగా కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం విడాకులు ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐరహే ఇలా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది.

ఇక ఇదిలా ఉండగా తాజాగా మరొక జంట విడాకులకు సిద్ధమయ్యారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో పెద్దఎత్తున చక్కర్లు కొడుతోంది.  అయితే తాజాగా ప్రముఖ సింగర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రావణ భార్గవి, హేమచంద్ర సూపర్ సింగర్ కార్యక్రమం ద్వారా పరిచయమై అనంతరం ప్రేమలో పడ్డారు. ఇక ఈ జంట పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.అయితే  2013వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న వీరిద్దరు తొమ్మిది సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితంలో గడిపారు.

అంతేకాకుండా వీరిద్దరికి ఒక పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఇక  గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని అందుకే విడివిడిగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే  వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి ఒక ఫ్రెండ్ కారణమని తెలుస్తోంది.ఇకపోతే  వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయినటువంటి మరొక సింగర్ తో హేమచంద్ర చనువుగా ఉండటమే కాకుండా ఆమెతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో క్లిప్ విన్న శ్రావణ భార్గవి హేమచంద్రకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారనీ తెలుస్తోంది.ఇకపోతే ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయంతో ఇప్పటికే విడిగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇక ఇలా వీరి గురించి విడాకులు వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఈ జంట స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: