బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ తాజాగా పృథ్వి రాజ్ సామ్రాట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ సరసన సంయోజితా పాత్రలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ నటించారు.  మానుషీ చిల్లార్ కి ఇది డెబ్యూ సినిమా.

ఈ ప్రేమకు చంద్ర ప్రకాష్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పృథ్వీరాజ్ సామ్రాట్ సినిమా విడుదలైన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి షో కే నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ పై ఆ నెగిటివ్ టాక్ ప్రభావం చాలా గట్టిగా పడింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు నుంచే కలెక్షన్ లు డ్రాప్ అవుతూ వచ్చాయి. అలా చివరగా ఈ మూవీ కి నష్టాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో  ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయిన పృథ్వి రాజ్ సామ్రాట్ మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో  జులై 1 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలింస్ వారు నిర్మించిగా , ఈ సినిమాలో సోను సూద్, సంజయ్ దత్, అశుతోష్ రానా, సాక్షి తన్వార్ ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: