టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ ప్రస్తుతం సర్దార్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి విశాల్ హీరో గా 'అభిమన్యుడు' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ని తెరకెక్కించిన పి ఎస్ మిత్రన్  దర్శకత్వం వహించాడు .

మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది . సర్దార్ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది . ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంద . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు . ఈ మూవీ ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు . ఈ మూవీ లో కార్తి ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . అలాగే ఈ మూవీ ని దర్శకుడు పి ఎస్ మిత్రన్  పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాట్లు తెలుస్తోంది . 

కార్తి ఆఖరుగా సుల్తాన్ మూవీ లో హీరోగా నటించాడు . ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి సర్దార్ మూవీ తో కార్తీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇప్పటికే సర్దార్ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: