టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన గురించి టాలీవుడ్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

అలాగే ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మంచి విజయాలు సాధించడంతో రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. అలాగే కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన తెలుగుతో పాటు బాలీవుడ్ పైన కూడా బాగానే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా రష్మిక మందన ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం రష్మిక మందన గుడ్ బై అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ కి సంబంధించి ఎంతో ఎమోషనల్‌ అవుతూ రష్మిక మందన ఒక పోస్ట్‌ కూడా పెట్టింది.

మూవీ జర్నీ మొదలై రెండు సంవత్సరాలు గడిచాయి. గుడ్ ‌బై మూవీ  ఎలాంటి మ్యాజిక్ ను చేస్తుందో చూడాలని చాలా ఆతృతగా ఉన్నాను. అలాగే అమితాబ్ బచ్చన్ సార్ మీరంటే నాకు చాలా అభిమానం. మీతో ఈ మూవీ చేసినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఉన్నాను. మీరు గొప్ప వ్యక్తి  అంటూ రష్మిక మందన అమితాబచ్చన్ గురించి ఎంతో ఎమోషనల్‌ గా రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: