దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఈజీగా రెండేళ్లు పడుతుంది  అన్న సంగతి మనకి తెలిసిందే.అయితే  అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే  మహేశ్‌ బాబు తో తీయబోయే సినిమా మాత్రం పక్కా రెండేళ్లలో పూర్తి చేస్తానని చెబుతున్నాడు.అయితే  ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్నది రేండేళ్లు ఆగితే కాని తెలియదు. ఇక ఇప్పటి వరకు అయితే ఇచ్చిన మాట రాజమౌళి ఎప్పుడు నిలబెట్టుకోలేదు.కాగా  ప్రతీసారి ఏళ్ల ఏళ్లు సినిమాలు తీస్తూనే వస్తున్నాడు.ఇదిలావుంటే రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్‌ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. 

అయితే మహేశ్‌ కెరీర్ లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే రాజమౌళితో మూవీ తర్వాత సుకుమార్ లేదా సందీప్ వంగాతో సినిమా చేసేందుకు మహేశ్‌ ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నాడట.ఇక అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే. అయితే కాని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు రాజమౌళితో మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే  ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌ వేశాడు. 

అంతేకాదు తిరిగి ఇండియాకు రాగానే త్రివిక్రమ్‌ మూవీని పట్టాలెక్కించనున్నాడు.ఇదిలావుంటే  2023 ప్రారంభంలో రాజమౌళి- మహేశ్‌ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది.ఇక జూలై సెకండ్ వీక్ నుంచి త్రివిక్రమ్ మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.అతడు ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.థమన్ ఈ చిత్రానికి  సంగీతాన్ని అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: