పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది . ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండటంతో ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది . అందులో భాగంగా రంగ రంగ వైభవంగా మూవీ టీజర్  24 గంటలు పూర్తయ్యే సరికి 4.27 మిలియన్ వ్యూస్ లను , 104 కే లైక్ లను సాధించింది . ఓవరాల్ గా చూసుకుంటే రంగ రంగ వైభవంగా టీజర్ కు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందినట్లే అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ టీజర్ లో పంజా వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హైలెట్ గా నిలిచాయి.

మరి ఇప్పటికే ఉప్పెన మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ,  ఆ తర్వాత కొండాపొలం మూవీ తో బాక్స్ ఆఫీస్  దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' మూవీ తో ఎలాంటి విషయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకుంటాడో చూడాలి. రంగ రంగ వైభవంగా మూవీ ని దర్శకుడు గిరిశయ్య యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: