బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన అక్షయ్ కుమార్ తాజాగా సామ్రాట్ పృథ్వి రాజ్ అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా, ఈ మూవీ లో అక్షయ్ కుమార్ సరసన మనుషి చిల్లర్ కథానాయకిగా నటించింది. 

ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టు కునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా విడుదల అయిన మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్ లు కూడా చాలా తక్కువగా నమోదు అయ్యాయి. ఈ సినిమా ద్వారా భారీ మొత్తంలో నష్టాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. సామ్రాట్ పృథ్విరాజ్ మూవీ ని జులై 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఏ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దామని మిస్సయిన వారు ఉంటే జూలై 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: