స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్ గా పేరు పొందారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. చిన్న సినిమాలతో పాటుగా పాన్ ఇండియా చిత్రాలను కూడా తెరకెక్కిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. తాజాగా ఈ రోజున దిల్ రాజు తండ్రి అయ్యాడు అనే విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అయితే తన భార్య తేజస్విని బుధవారం ఉదయం ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక దీంతో దిల్ రాజు అభిమానుల సైతం కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని కొంత మంది దిల్ రాజుకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

2020 డిసెంబర్లో కరోనా సమయంలో దిల్ రాజు తేజస్విని వివాహం చేసుకున్నారు. దిల్ రాజుకు ఇది రెండో వివాహం మొదటి భార్య అనిత ఆయన నిర్మించిన చాలా చిత్రాలకు సమర్పకురాలిగా  పని చేసింది అయితే అనారోగ్యం కారణం వల్ల దిల్ రాజు మొదటి భార్య 2017 వ సంవత్సరం లో మరణించింది వీరికి హాన్షిత రెడ్డి  అనే కుమార్తె కలదు. మొదటి భార్య మరణాంతరం దిల్ రాజు వరంగల్ కు చెందిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.

ఇక ఇటీవలే ఎఫ్ త్రీ సినిమా విడుదల కూడా చేయడం జరిగింది. ఈ చిత్రం తర్వాత దిల్ రాజు బాలీవుడ్ లో కూడా హిట్, ది ఫస్ట్ కేస్ అనే చిత్రాన్ని రాజకుమార్ తో రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులను కూడా నిర్మించబోతున్నారు. అందులో ఒకటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు ఇక మరొకటి హీరో రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు వారి చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం దిల్ రాజు వారసుడి వార్త ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: