బాహుబలి సినిమాతో పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్  గా మారిన ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ ఆ సినిమాతో అలరించలేకపోయాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.ఇప్పుడు మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.మహానటి సినిమాతో ప్రశంసలు అందుకున్న నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) మొదటిసారి నేరుగా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది.ఇక సైన్స్‌ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై ప్రాజెక్ట్‌ కె చిత్రబృందం కూడా స్పందించింది. షూటింగ్‌ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.


ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ హీరో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక ఈ షూటింగ్ లో బిగ్ బి పాల్గొంటున్నారు. తాజాగా అమితాబ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో జరిగే ఓ సన్నివేశంలో అమితాబ్ పాల్గొన్నారు.ట్రైన్‌ సీక్వెన్స్‌ కోసం మెట్రో స్టేషన్ కు వెళ్లిన ఆయనను ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన పిక్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఇక అలాగే 'వైజయంతి మూవీస్‌' కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయ ప్రారంభోత్సవంలో రాఘవేంద్రరావు, అమితాబ్‌ బచ్చన్‌, ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌, నాని ఇంకా అలాగే దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో కొన్నిరోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: