టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన గోపీచంద్ తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా,  రావు రమేష్ , సత్య రాజ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. 

పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది. అలా చాలా రోజుల క్రితం ప్రారంభం ఆయన ఈ సినిమా ఎట్టకేలకు నిన్న అనగా జూలై 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. మొదటి నుండి పక్కా కమర్షియల్ చిత్ర బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15.20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.

ఇలా బారి టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన పక్కా కమర్షియల్ మూవీ మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు పక్కా కమర్షియల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన పక్కా కమర్షియల్ మూవీ రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: