మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం  మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా , ఈ మూవీ లో సునీల్  అంజలి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.  

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని షూటింగ్ స్పాట్  నుండి ఫోటోలు మరియు వీడియోలు లీక్ అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ సినిమా నుండి లీక్ అయిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ విషయం పైనే ప్రస్తుతం దర్శకుడు శంకర్ ప్రత్యేక ఫోకస్ ని పెట్టినట్లు తెలుస్తోంది. తదుపరి జరగబోయే ఈ సినిమా షెడ్యూల్ నుంచి ఇలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ కాకుండా దర్శకుడు శంకర్సినిమా షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీ ని మరింత టైట్ చేయనున్నట్లు తెలుస్తోంది.  

ఇలా శంకర్ , రామ్ చరణ్ సినిమా నుండి ఎలాంటి ఫోటోలు గాని వీడియోలు కానీ లీక్ కాకుండా అత్యధిక శ్రద్ద ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శంకర్ సినిమాలు ఎంత గ్రాండియర్ గా ఉంటాయో మన అందరికీ తెలిసిందే , ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కూడా అదే రేంజ్ లో గ్రాండియర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: