బాహుబలి సినిమా అవుట్ ఫుట్ చూశాక అందరికీ బాహుబలి 2 పై మరింత ఆసక్తి పెరిగింది. దాంతో బాహుబలి 2 కి మార్కెట్ గణనీయంగా పెరిగిపోయింది. ఈ సినిమాను జక్కన్న తీర్చిదిద్దిన వైనం చూసి ప్రపంచమే ఔరా అంటూ నోరెళ్ళబెట్టింది. అయితే ఆ తర్వాత బాహుబలి 3 కూడా వస్తే బాగుంటుందని అంతా అనుకుంటూనే ఉన్నారు. అభిమానులు మాత్రమే కాదు పలువురు సినీ దిగ్గజాలు, ప్రముఖులు కూడా ఎస్.ఎస్ రాజమౌళి కి పర్సనల్ గా ఫోన్ చేసి మరీ బాహుబలి 2 ని కొనసాగిస్తే బాగుంటుందని కోరారు అని అప్పట్లో చాలా వార్తలే వినిపించాయి. అయితే తాజా వార్త ఒకటి బాహుబలి 3 సినిమా ఉండనుంది అని క్లూ ఇస్తోంది. ఇంతకీ అదేమిటి అంటే...రీసెంట్ గా బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తో కలిసి..  పారిస్ లో యూనిట్ ఇమేజ్ అనే భారీ త్రీడి విఎఫెక్స్ స్టూడియోకి వెళ్ళారు జక్కన్న.

వీళ్లతో  రాజమౌళి సినిమాలకు విఎఫెక్స్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న కమల్ కన్నన్ కూడా అక్కడికి వెళ్లారు. అందరూ కలిసి స్టూడియో సంస్థ ప్రతినిధులతో పలు చర్చలు జరిపారు.  కాగా అక్కడ స్టూడియో దగ్గర వారు దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు రాజమౌళి.   ఫొటోతో పాటు త్వరలో కీలకమైన ప్రాజెక్ట్ ప్రకటన ఉండబోతుంది అని కొసమెరుపు వేశారు. దాంతో అందరూ అటెన్షన్ అయ్యారు. అటేమో బాహుబలి నిర్మాతతో కలిసి అంత పెద్ద స్టూడియో దగ్గరకి వెళ్ళారు.. ఇపుడెమో బడా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అంటున్నారు అంటే అది ఖచ్చితంగా బాహుబలి3 డే అని అనుకుంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

కానీ వాస్తవంగా ఇది రూమర్ గానే చెప్పుకోవాలి. ప్రస్తుతం అటు రాజమౌళి కానీ ఇటు ప్రభాస్ కానీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ అయితే సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె మరియు మారుతీప్రాజెక్ట్ ఇలా ఇన్ని సినిమాలు ఉండగా... బాహుబలి 3 తీయడానికి డేట్స్ ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంకో మూడు సంవత్సరాలు ఆగాల్సిందే. ఆ తరువాత షూటింగ్ స్టార్ట్ చేస్తే మరో మూడేళ్లు పడుతుంది. అలా ఇక ఈ సినిమా ఇప్పటి నుండి ఆరేళ్ళ కాలంలో తెరకెక్కి మనం ముందుకు రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: