సీనియర్ హీరో కమలహాసన్ దాదాపుగా నాలుగు సంవత్సరాలు తర్వాత విడుదల చేసిన చిత్రం విక్రమ్. ఈ సినిమాని యువ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తేరకేకించడం జరిగింది. కమలహాసన్ తన నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్, నరేష్ కీలకమైన పాత్రలు నటించడం జరిగింది. ఇక అతిది పాత్రలో మాత్రం సూర్య అదరగొట్టేసాడని చెప్పవచ్చు ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 3న విడుదలైంది. మొదటి షో నుంచి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సైతం సృష్టిస్తోంది.


కమలహాసన్ నట విశ్వరూపం విజయ్ సేతుపతి, ఫ హాద్ ఫాజిల్ , నరేష్ నటన ఈ సినిమాకి హైలెట్గా నిలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో కమల్ హాసన్ ఈ సినిమా సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉన్నారు. ఇక అంతే కాకుండా కమల్ హాసన్ సైతం ఈ సినిమా లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తన వంతు సహాయంగా చేయడం జరిగింది. ఇక ఏ సినిమాని తెలుగులో హీరో నితిన్ డిస్ట్రిబ్యూటర్ గా చేయడం జరిగింది. దీంతో వీరికి కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.


తాజాగా మహేష్ విక్రమ్ సినిమా చూసి స్పందించడం జరిగింది. తనకు నచ్చిన సినిమా విషయంలో వెంటనే స్పందించే వారిలో మహేష్ కూడా ఒకరు మహేష్ విదేశాలలో ఉండడంవల్ల విక్రమ్ సినిమా పైన కాస్త ఆలస్యంగా స్పందించారు. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఒక కొత్త యుగం కాల్ టు క్లాసిక్ లోకేష్ మిమ్మల్ని కలుసుకొని విక్రమ్ సినిమా గురించి చర్చించడానికి చాలా ఇష్టపడుతున్నాను  మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ కాని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: