మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే విషయం తెలిసిందే


భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రొటీన్ మాస్ మసాలా కథ తో ఈ సినిమా తెరకెక్కడం తో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం అయితే లేదనే విషయం తెలిసిందే.


భారీ స్థాయి లో బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే పక్కా కమర్షియల్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో మారుతికి ప్రభాస్ భారీ షాక్ ఇవ్వబోతున్నారని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నా యి. ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు అయితే లేవని సమాచారం అందుతోంది.


  స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కు ముందు లో, మీడియం బడ్జెట్ల సినిమా లు చేయవద్దని ఆయన ప్రభాస్ కు సూచన లు చేశారని వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ఇలాంటి సమయం లో ప్రభాస్ రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరట..


  ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషంగా లేరని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న కామెంట్ల గురించి ప్రభాస్, మారుతి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ప్రభాస్, మారుతి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నా రు. సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: