మెగా హీరోలు అందరు మల్టీ స్టారర్ మూవిస్ చేస్తున్నారు. మొన్న రామ్ చరణ్, నిన్న చిరంజీవి, నేడు పవన్ కళ్యాణ్ లు అదే పనిలో ఉన్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి చేస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆయన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' ఇంకా షూటింగ్ ముగించుకోలేదు. ఈ సినిమాల తో పాటు మరికొన్ని సినిమాలను చేసెందుకు రెడీ అవుతున్నాడు.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ kతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ మల్టీస్టారర్ మూవీ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.


తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన 'వినోదయ సీతం'ను తెలుగులో రీమేక్ చేసేందుకు విలక్షణ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని రెడీ అయ్యారు. ఈ సినిమా లో పవన్, సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లు గా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా ను అఫీషియల్‌గా లాంఛ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూట్‌కు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది..


వినోదయ సీతం' చిత్ర రీమేక్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను జూలై రెండవ వారంలో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తొలుత సాయి ధరమ్ తేజ్‌కు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా కోసం పవన్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించినట్లు గా తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇతర నటీ నటులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.. పవన్ తో సినిమా అంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందె.. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: