ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రేక్షకులందరికీ అదిరిపోయే కామెడీ పంచుతూ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది ఈ సినిమా. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది రాశి కన్నా. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత స్టేటస్ మెయింటైన్ చేయాలని చెబుతూ ఉంటారు. అలా మీకు ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం చెప్పింది.
అవును.. నిజంగానే ఒక స్థాయికి చేరుకున్న తర్వాత.. స్టేటస్ మెయిల్ చేయాలని.. ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవారు చాలా మందే ఉంటారు. అయితే నేను అలాంటివి పట్టించుకోను. ఎందుకంటే నాకంటూ ఒక మైండ్ సెట్ వుంది. ఇక నా మైండ్ చెప్పిన ప్రకారమే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఒకవేళ నా మైండ్ కు స్టేటస్ మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని బలవంతంగా ఎక్కించాలని ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళను ఆటోమేటిక్గా దూరం పెట్టేస్తాను. అయినా నా దృష్టిలో కామన్ పీపుల్ సెలబ్రిటీలు అనే తేడా లేదు అంటూ రాసి కన్నా చెప్పుకొచ్చింది.