మారుతి గోపీచంద్ ల కాంబినేషన్ లో లేటెస్ట్ గా విడుదలైన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. హిట్ టాక్ తెచ్చుకున్న మీడియం రేంజ్ సినిమాలు కూడ నిలబడలేక పోతున్న పరిస్థితులలో ఈ ఏవరేజ్ టాక్ తో ఈమూవీ ఎంతవరకు నిలబడగలుగుతుంది అన్న సందేహాలు వస్తున్నాయి.



ఇప్పటి వరకు గోపీచంద్ నటించిన సినిమాలు 8 వరసగా పరాజయం చెందాయి. దీనితో ఈసినిమా విజయం గోపీచంద్ తో పాటు మారుతికి కూడ కీలకంగా మారింది. అయితే ‘పక్కా కమర్షియల్’ మూవీ చూసిన సగటు ప్రేక్షకుడు ఆమూవీలోని హాస్య సన్నివేశాలు రొటీన్ గా ఉండటంతో పెదవి విరుస్తున్నాడు. కథ కూడ రొటీన్ గా ఉండటంతో మారుతి ఇలాంటి కథను ఎందుకు ఎన్నుకున్నాడు అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.



ఈసినిమా పై రాశి ఖన్నా చాల ఆశలు పెట్టుకుంది ఆమె కెరియర్ కూడ అంతంత మాత్రంగా ఉండటంతో ఈ సినిమాతో అయినా తిరిగి ట్రాక్ లోకి రావాలని ఆమె తిరుపతి వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామికి మొక్కులు కూడ మొక్కుకుంది. అయినా పెద్దగా దేవుడు కరుణించి నట్లు కనిపించడం లేదు. ఈమూవీ హిట్ అయితే మారుతి ప్రభాస్ తో కానీ చిరంజీవితో కానీ సినిమా చేసే అవకాశం వస్తుందని కలలు కన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఆ కలలు నెరవేరకపోవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.


‘ప్రతిరోజు పండగే’ లాంటి ఆలోచింపచేసే కథతో సినిమాను తీసిన మారుతి ఇలాంటి రొటీన్ కథను ఎందుకు ఎంచుకున్నాడు అంటూ విమర్శలకు ఆశ్చర్య పడుతున్నారు. దీనితో మారుతిని నిరుత్సాహ పరచలేకా విమర్శకులు మారుతికి ఏవరేజ్ మార్కులు వేస్తున్నారు. అన్నిటికంటే సినిమా ఇండస్ట్రీ గురించి ప్రేక్షకుల అభిరుచి గురించి పూర్తిగా తెలిసిన అల్లు అరవింద్ బన్నీ వాసులు లాంటి వ్యక్తులు ఏ ధైర్యంతో ఈసినిమాను తీసారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వచ్చే వారం కూడ చెప్పుకోతగ్గ సినిమాలు లేకపోవడంతో రొటీన్ హాస్యాన్ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఈసినిమాను చూసే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: