హీరో గోపీచంద్ అందాల తార రాశి ఖన్నా నటించిన తాజా చిత్రం పక్క కమర్షియల్. ఈ సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్న డైరెక్టర్ మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలు జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని బన్నీ వాసు నిర్మాతగా నిర్మించారు. టీజర్ ట్రైలర్ ప్రేసెకులను బాగానే ఆకట్టుకున్నాయి ఈ సినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో కమర్షియల్ పలు ఎలివేషన్స్ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను తెచ్చిపెట్టాయి.



దీంతో ఈ సినిమా బాగానే దూసుకుపోతోంది. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలకు రాశీ ఖన్నా అందం, అభినయం మారుతి స్టైల్ కామెడీకి ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో  సినిమా టాక్ తగ్గట్టుగానే మొదటి రోజు పక్కా కమర్షియల్ సినిమాకి భారీగానే వసూలు చేసినట్లుగా తెలుస్తోంది మొదటి రోజు దాదాపుగా రూ.6.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. దీంతోపాటు గోపీచంద్ కెరీర్ లోని ఈ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు.


ఈవారం కూడా పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో వీకెండ్ కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా కోర్టు సన్నివేశాలు ఈ సినిమాలో త్యాగరాజ్ రావు రమేష్ సప్తగిరి వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ అతిథి పాత్రలో నటించి అందరిని మైమరిపించింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే. మరి గోపీచంద్ తన తదుపరి చిత్రం పైన ఫోకస్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: